Friday, May 3, 2024

ప్రధానిపై రాహుల్ విమర్శలు

- Advertisement -
- Advertisement -

Rahul gandhi criticism on PM Narendra Modi

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ అలసత్వం వల్లే ఇలాంటి దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని రాహుల్ ఆరోపించారు. కరోనా సంక్షోభానికి కేంద్రం పరిష్కారం చూపాలన్నారు. ప్రసంగాల వల్ల ఎలాంటి లాభం లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. దేశం నలుమూలల నుంచి బాధకరమైన వార్తలు వినాల్సి వస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పసలేని ప్రసంగాలు కాదు.. కరోనా సంక్షోభానికి పరిష్కారం చూపాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చూశారు.

Rahul gandhi criticism on PM Narendra Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News