Thursday, May 2, 2024

రామ్ చరణ్‌కు జోడీగా రష్మిక..

- Advertisement -
- Advertisement -

Rashmika to pair with Ram Charan in 'Acharya'

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. కొన్నిరోజులు చిరు లేకుండానే షూటింగ్ చేశారు కొరటాల శివ. తాజాగా చిరు షూటింగ్‌లో అడుగుపెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం మెగాస్టార్ మీద యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. కాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ ఒక కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లపాటు సినిమాలో చరణ్‌కు జోడీగా ఎవరు నటిస్తారనేది తెలియలేదు. మధ్యలో పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపించినా ఇప్పుడు మాత్రం యంగ్ బ్యూటీ రష్మిక మందన్న కథానాయకిగా ఖరారైనట్టు తెలిసింది. అయితే, ఈ విషయమై ‘ఆచార్య’ టీమ్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జనవరి మూడో వారంలో ‘ఆచార్య’ సెట్లోకి అడుగుపెడతాడట రామ్‌చరణ్. అప్పుడే రష్మిక కూడా షూటింగ్‌లో పాల్గొంటుందని, ఒకే షెడ్యూల్లో వీరిద్దరికీ సంబంధించిన చిత్రీకరణను పూర్తిచేస్తారని సమాచారం. కొరటాల తన ఎవర్‌గ్రీన్ ఫార్ములా అయిన కమర్షియాలిటీకి సోషల్ మెసేజ్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Rashmika to pair with Ram Charan in ‘Acharya’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News