Thursday, April 25, 2024

ఒడిశా రైలు ఘటన బాధితులకు రిలయన్స్ 10 పాయింట్ల సహాయక చర్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒడిశా రైలు ప్రమాదం బాధితులకు 10 పాయింట్ల సహాయ ప్రణాళికను సోమవారం రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందగా, 1000 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై రిలయన్స్ ఫౌండర్, చైర్‌పర్సన్ నీతా అంబానీ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని, గాయపడిన వారికి సహాయం చేసేందుకు ఫౌండేషన్ విపత్తు నిర్వహణ బృందం అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు.

రిలయన్స్ 10 పాయింట్ రిలీఫ్ ప్లాన్
1. జియో బిపి నెట్‌వర్క్ ద్వారా విపత్తు నిర్వహణ చేపడుతున్న అంబులెన్స్‌లకు ఉచిత ఇంధనం.
2. రిలయన్స్ స్టోర్ల ద్వారా బాధిత కుటుంబాలకు వచ్చే ఆరు నెలల పాటు పిండి, పంచదార, పప్పు, బియ్యం, ఉప్పు, వంట నూనెతో సహా ఉచిత రేషన్ సరఫరాలను అందించడం.
3. గాయపడిన వారికి వారి తక్షణ అవసరాలకు ఉచిత మందులు, ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరాల్సిన వారికి వైద్య చికిత్స.
4. భావోద్వేగ, మానసిక సామాజిక మద్దతు కోసం కౌన్సెలింగ్ సేవలు అందించడం.
5. జియో, రిలయన్స్ రిటైల్ ద్వారా మరణించిన వారి కుటుంబంలో ఒక సభ్యునికి ఉపాధి అవకాశాలను అందించడం
6. వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలతో సహా వైకల్యాలున్న వ్యక్తులకు సహాయం అందించడం.
7. కొత్త ఉపాధి అవకాశాలను కనుగొనడానికి ప్రభావితమైన వారికి ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వడం.
8. ఘటనలో సంపాదించే కుటుంబ సభ్యులను కోల్పోయిన మహిళలకు మైక్రోఫైనాన్స్, శిక్షణ అవకాశాలు
9. ప్రమాదం వల్ల ప్రభావితమైన గ్రామీణ కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం ఆవు, గేదె, మేక, పౌల్ట్రీ వంటి వాటిని అందించడం.
10. వారి జీవనోపాధిని పునర్నిర్మించుకోవడానికి వీలుగా ఒక సంవత్సరం పాటు మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉచిత మొబైల్ కనెక్టివిటీ ఇవ్వడం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News