మనతెలంగాణ/హైదరాబాద్: డ్రోన్ కెమేరా కేసులో ఎంపి రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూకట్పల్లి కోర్టు కొట్టివేయడంతో ఈ మేరకు హైకోర్టులో గురువారం రేవంత్రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే రేవంత్పై కేసులు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. రేవంత్రెడ్డికి పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని.. డ్రోన్ వినియోగించారనడానికి ప్రాథమిక ఆధారాలు లేవన్నారు. ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోర్టుకు రేవంత్ న్యాయవాది విన్నవించుకున్నారు. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసుకు సంబంధించి వివరాలను సమర్పించాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను వచ్చే సోమవారాని(16వ తేదీ)కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఉప్పర్పల్లి కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ న్యాయవాది వెనక్కి తీసుకున్నారు.
Revanth reddy brother filed quash petition in High Court