- Advertisement -
మన తెలంగాణ/శంషాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం థిన్వైర్ రూపంలో 1.4కిలోల బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన వ్యక్తి కరెంట్ వైర్ బండిల్స్లో బంగారం తీసుకువస్తుండగా కస్టమ్స్ అధికారుల తనిఖీలలో బయటపడింది. దాదాపు రూ.80 లక్షలు విలువ చేసే 1.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
1.4 Kg Gold Seized at Shamshabad Airport
- Advertisement -