Friday, May 3, 2024

2 కోట్లతో యాక్షన్ ఎపిసోడ్

- Advertisement -
- Advertisement -

ఇండియన్ స్క్రీన్‌పై భారీ యాక్షన్ సినిమాగా ‘సాహో’ సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాలో ప్రభాస్ స్టంట్స్‌కి, ఒళ్లు గగుర్పొడిచే ట్రీట్‌కి మాస్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ప్రభాస్ ఇతర సినిమాల్లో కూడా యాక్షన్‌కి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదన్నది తెలిసిందే. ఆయన నటించిన ఛత్రపతి, బిల్లా, రెబల్ లాంటి సినిమాల్లో యాక్షన్ హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్యూర్ లవ్ స్టోరి ‘రాధే శ్యామ్’లో నటిస్తున్నాడు ప్రభాస్. ఇందులో యాక్షన్ ఉందా లేదా? అన్న సందేహాలు అభిమానులకు ఉన్నాయి.

అయితే, అలాంటి వారికే ఈ సమాధానం అన్నట్టుగా ఇప్పుడు భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం 2 కోట్ల భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎపిసోడ్‌ని తెరకెక్కించనున్నారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ ఈ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తాడు. ప్రభాస్ పైనే మొత్తం యాక్షన్ సీన్ ని తెరకెక్కించాల్సి ఉందట. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తుందని… ఖచ్చితంగా ఇది అభిమానులకు మాస్ ట్రీట్ అవుతుందని చెబుతున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో పని చేయడం, ఇంత భారీగా ఖర్చు చేయడం భారతీయ సినిమాల్లో కొత్త కాదు. ఇంతకుముందు సాహో, సైరా, వార్ చిత్రాలకు విదేశీ సాంకేతిక నిపుణులు పని చేశారు. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ విషయంలోనూ ఆ తరహాలోనే విదేశీ యాక్షన్ కొరియోగ్రాఫర్ పని చేస్తున్నాడు.

Rs 2 Crore Spent for Action Episode in Radhe Shyam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News