Sunday, April 28, 2024

ఆర్‌బిఐ వేలంలో రూ.2 వేల కోట్ల రుణ సమీకరణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనున్నది. జులై 4వ తేదీన (మంగళవారం) రిజర్వ్‌బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అనుమతించడంతో.. రూ.2000 కోట్లను రుణంగా సమీకరించుకోనుంది. ఇందు కోసం 18 ఏళ్ల కాలానికి రూ.1000 కోట్లు, 17 ఏళ్ల కాలానికి రూ.1000 కోట్ల చొప్పున రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. వేలం అనంతరం రాష్ట్ర ఖజానాకు ఆ మొత్తం సమకూరుతుంది. తెలంగాణతో పాటు మరో ఎనిమిది రాష్ట్రాలు ఈ వేలం ద్వారా రూ. 16 వేల 200 కోట్ల రుణాలను సమీకరించనున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 3 వేల కోట్లు, తమిళనాడుకు రూ. 4వేల కోట్లుతో పాటు పలు రాష్ట్రాలు నిధులను బాండ్ల వేలంలో సమీకరించుకోనున్నాయి. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ- కుబేర్) విధానంలో ఈ వేలం నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News