ఆమె ఏది చేసినా సంచలనమే…సినిమా అయినా, టాక్ షో అయినా…
హైదరాబాద్: నటి సమంత గత ఏడాదిగా వార్తల్లో సంచలనంగా మారింది. నాగచైతన్య నుంచి విడిపోయినా ఆమె ఇప్పటికీ సంచలనం రేపుతూనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా సమర్పించే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి సమంత ముఖ్య అతిథిగా హాజరైనట్లు అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా గురువారం అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిందంటున్నారు. ఆ క్విజ్ షోలో ఆమె రూ. 25 లక్షలు గెలుచుకున్నారని కూడా భావిస్తున్నారు. నాగచైతన్యతో విడిపోయాక టివి షోలో ఆమె కనిపించడం ఇదే మొదటిదని చెప్పవచ్చు.
సమంత పాల్గొన్న ఈ షో దసరా కానుకగా అక్టోబర్ 15న(శుక్రవారం) ప్రసారం చేస్తారని కూడా భోగట్టా. జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికరంగా ఈ నిర్వహిస్తున్న ఈ షోలో ఇదివరకే నటుడు రామ్చరణ్, దర్శకుడు రాజమౌళి, మరో దర్శకుడు కొరటాల శివ అలరించారు. కాగా స్టార్ ‘ప్రిన్స్’ మహేశ్ బాబు కూడా ఇటీవలే షోలో పాల్గొన్నారని, ఆ ఎపిసోడ్ దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రసారం కాగలదని వినికిడి.
సంచనాల తార సమంత, జూనియర్ ఎన్టీఆర్తో కొన్ని సినిమాల్లో నటించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గతంలో ‘బిగ్బాస్’, ప్రస్తుతం ‘ ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి హోస్ట్గా ఉన్నారు. ఏది ఎలా ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ షోను ఎలా నిర్వహించారు, సమంతను ఎలాంటి ప్రశ్నలు అడిగారు, సమంతా ఎలా సమాధానాలు ఇచ్చింది వంటివి తెలుసుకోవాలంటే ఆ షో విడుదలయ్యే వరకు మనమంతా ఆగాల్సిందే.