Tuesday, May 14, 2024

దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మిక వేత్త

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బంజారా, లంబాడాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకులు అని కొనియాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా సిఎం కెసిఆర్ లంబాడా, బంజా రా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి బంజారాహిల్స్‌గా పిలవబడుతున్న ప్రాంతంలో మూడు శతాబ్దాల క్రితమే సేవాలాల్ మహారాజ్ నడయాడారని, అదే బంజారాహిల్స్ నేల మీద వారి పేరుతో నిర్మించిన భవన్‌లో ప్రభుత్వం అధికారికంగా వారి జ యంతోత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి వారి జయంతోత్సవాల నిర్వహణ మరో ఉదహరణగా నిలిచిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఆడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక, సాంస్కృతిక జీవని విధానాన్ని కాపాడడం కోసం వా రు చేసిన కృషి గొప్పదన్నారు. తన ప్రజలను బయ టి సమాజం నుంచి అనుక్షణం రక్షించుకునే దిశగా సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితాంతం పోరాటం సాగించారన్నారు. ఆ దిశగా ఆయన కల్పించిన చైతన్యం, చేపట్టిన కార్యాచరణ దేశవ్యాప్తంగా ఉన్న లంబాడా, బంజారాలకు రక్షణ కవచంగా నిలిచిందన్నారు. బం జారాలకు స్పూర్తి ప్రదాతగా నాటి కాలంలో ఆయన చేసిన కృషి విశ్వవ్యాప్తంగా ఉన్న బంజారాలకు ఆయనను ఆధ్యాత్మిక గురువుగా, తమ ఆరాధ్య దైవంలా కొలిచేలా చేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

బంజారా, లంబాడావర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అనే క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలు చేపట్టిందని తెలిపారు. రా ష్ట్రంలోని తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ‘మా తం డాలలో మా రాజ్యం’ అనే గిరిజనుల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షలను నేరవేర్చి గ్రామ పరిపాలనలో వారిని భాగస్వాములను చేశామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి తండా గ్రామ పం చాయితీలో ఒక గ్రామ పరిపాలన భవన్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.ఈ దిశగా గిరిజన సంక్షేమం లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కెసిఆర్ అన్నారు.

గిరిజన బిడ్డల ఆత్మగౌరవం పరిఢవిల్లేలా వారి ప్రతిభను చాటేందుకు, ఉద్యోగ, ఉపాధి, విద్య, క్రీ డలు తదితర రంగాలలో ప్రభు త్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని సిఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వారు దేశానికి కీర్తి తెచ్చే దిశగా ఎదుగుతుండడం తనకెంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రాంతంలో సంత్ సేవాలాల్‌మహారాజ్ పేరుతోనే బంజా రా భవన్‌ను ఆయన ఆత్మగౌరవం ఉట్టిపడేలా నిర్మించామన్నారు. అందులో సంత్ సేవాలాల్ విగ్రహ ప్రతిస్టాపన చేసామని చెప్పా రు. ఆయన జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News