Sunday, April 28, 2024

సరితకు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

Sarita More wins gold at Wrestling Championship

 

గోండా: జాతీయ సీనియర్ మహిళల రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సరిత మోర్ (ఆర్‌ఎస్‌పిబి) స్వర్ణం గెలుచుకుంది. శుక్రవారం జరిగిన 59 కిలోల విభాగం ఫైనల్లో సరిత 80 తేడాతో అగ్రశ్రేణి రెజ్లర్ గీతా ఫొగట్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన సరిత ఏ దశలోనూ గీతను కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అద్భుత ఆటతో అలరించిన సరిత అలవోక విజయంతో స్వర్ణం సొంతం చేసుకుంది. మరోవైపు 62 కిలోల విభాగంలో సంగీత ఫొగట్ (హర్యానా) పసిడి పతకం గెలుచుకుంది. ఫైనల్లో సంగీత ఢిల్లీకి చెందిన రీతు రాణిని చిత్తు చేసింది. మహిళల 50 కిలోల విభాగంలో శివాణి పవార్ (మధ్యప్రదేశ్), 53 కిలోల విభాగంలో పూజా గెహ్లాట్ (ఢిల్లీ), 55 కిలోల విభాగంలో అంజు (హార్యానా),57 కిలోల విభాగంలో మాన్సి (హర్యానా) స్వర్ణ పతకాలు సాధించారు. ఇక పురుషుల 61 కిలోల విభాగంలో మంగల్ (ఎస్‌ఎస్‌సిబి), 70 కిలోల విభాగంలో విశాల్, 86 కిలోల విభాగంలో సందీప్ మాన్ (పుణె) తదితరులు స్వర్ణ పతకాలు దక్కించుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News