Monday, April 29, 2024

హనుమ విహారికి చోటు

- Advertisement -
- Advertisement -

Hanuma Vihari named in India squad for tour of South Africa

 

ముంబై: దక్షిణాఫ్రికాలో పర్యటించే ఇండియాఎ జట్టులో తెలుగుతేజం హనుమ విహారికి చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరిగే టెస్టు సిరీస్‌లో హనుమ విహారికి స్థానం దక్కలేదు. అయితే సౌతాఫ్రికాలో పర్యటించే భారతఎ జట్టులో మాత్రం విహారికి చాన్స్ దక్కింది. హనుమ విహారి ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరిసారి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిష్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అతనికి జాతీయ జట్టులో స్థానం దక్కలేదు. అంతేగాక కివీస్ సిరీస్‌లో అతనికి నిరాశే మిగిలింది. కాగా, ఇండియాఎ జట్టులో మాత్రం స్థానం దక్కించుకున్నాడు. కివీస్ సిరీస్‌కు దూరంగా ఉన్న పలువురు ఆటగాళ్లకు సౌతాఫ్రికాలో పర్యటనలో చోటు దక్కింది. పృథ్వీషా, నవ్‌దీప్ సైని, రాహుల్ చాహర్ తదితరులు ఇండియాఎ జట్టులో చోటు సంపాదించారు. ఇక భారత జట్టుకు ప్రియాంక్ పంచల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News