- Advertisement -
హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఫోర్ స్టూడియోస్ డైరెక్టర్ గర్రెపల్లి సతీష్ పుట్టిన రోజు సందర్భంగా మేకోవరు స్టూడియోస్ చైర్మన్ జ్యోతి మొక్కలు నాటడం జరిగింది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తితో జ్యోతి తన అఫీస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమని, ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని వారు కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటి వాటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని జ్యోతి తెలిపారు.
- Advertisement -