Tuesday, May 21, 2024

‘హస్ముఖ్ సాహబ్ కి వాసియాత్’లో నటించిన సీమా పహ్వా

- Advertisement -
- Advertisement -

NSDతో సహా ఢిల్లీలోని అన్ని రెపర్టరీ థియేటర్ కంపెనీలలో పనిచేసిన ప్రముఖ నటి, దర్శకురాలు సీమా పహ్వా 1970లో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు. భారతదేశపు మొదటి సోప్ ఒపెరా ‘హమ్ లోగ్’ (1984)లో కూడా నటించేందుకు థియేటర్ ఆమెను అనుమతించింది. ఆమె ఈ రోజు ప్రముఖ చలనచిత్ర, ఓటిటి, టెలివిజన్ నటి అయినప్పటికీ, థియేటర్‌తో ఆమె అనుబంధం విడదీయబడలేదు. నాటక రచయిత మహేశ్ దత్తాని టెలిప్లే ‘హస్ముఖ్ సాహబ్ కి వాసియాత్’లో నటించిన ఆమె, ఈ నాటకం ఇప్పుడు కన్నడ, తెలుగులో ప్రసారం కానున్నందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “మహేష్‌తో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను కర్ణాటకకు చెందినవాడు అయినప్పటికీ, అతని కథలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను కనుగొన్నాయి. అతని నాటకాలలో ఒకటి ఇప్పుడు కన్నడ, తెలుగులోకి అనువదించబడటం సముచితం” అని అన్నారు.

ఒక నిరంకుశ వ్యాపారవేత్త (మోహన్ అగాషే) చుట్టూ తిరిగే టెలిప్లేలో ఒక ముఖ్యమైన పాత్ర పహ్వా పోషించింది, అతను తాను మరణించిన తర్వాత కూడా వీలునామా ద్వారా తన కుటుంబాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తాడు. దత్తాని సమర్థుడైన దర్శకుడే కాకుండా టెలిప్లే రచయిత కూడా అయినందున తన పాత్రను డీకోడ్ చేయడం తనకు సులభమైందని ఆమె చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. ” థియేటర్‌పై అతని అవగాహన చాలా లోతైనది. అతను మాకు గిరీష్ కర్నాడ్, బివి కారంత్ వంటి మహోన్నత వ్యక్తులను అందించిన నాటక వారసత్వం నుండి వచ్చారు ” అని అన్నారు.

కన్నడ, తెలుగు ప్రేక్షకులు ‘హస్ముఖ్ సాహబ్ కీ వాసియాత్’ హాస్యాన్ని ఆదరిస్తారా అని అడిగినప్పుడు, “వినోదం లేదా భావోద్వేగాలకు భాష ఉందని అనుకోను. ఈ టెలిప్లే లేవనెత్తే సమస్యలు దక్షిణ భారతదేశంలో లేదా ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలోనైనా బయటపడవచ్చు” అని అన్నారు. మహేష్ దత్తాని చిత్రీకరించిన ఈ టెలిప్లేలో మోహన్ అగస్గే, అచింత్ కౌర్, మోనా వాసు, గగన్ సేథి కూడా నటించారు. ఇది నవంబర్ 19న ఎయిర్‌టెల్ థియేటర్, డిష్ టీవీ రంగ్‌మంచ్ యాక్టివ్ మరియు డి2హెచ్ రంగ్‌మంచ్ యాక్టివ్‌లో ప్రసారం చేయబడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News