- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం రూ.54 లక్షల విలువైన విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్కు చెందిన ఇద్దరు ప్రయాణికులు విదేశీ కరెన్సీతో దుబాయ్ వెళ్తూ కస్టమ్స్ అధికారులకు దొరికారు.బంగారు రంగు కవర్లో ప్యాక్ చేసుకుని వెళ్తుతుండగా తనిఖీ చేసి కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ ఉప కమిషనర్ శివకృష్ణ తెలిపారు. రూ.54 లక్షల విలువైన మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీగా గుర్తించినట్లు వెల్లడించారు. ఇద్దరు ప్రయాణికులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
- Advertisement -