Friday, May 10, 2024

పెండింగ్ దరఖాస్తుల నుంచే లబ్దిదారుల ఎంపిక

- Advertisement -
- Advertisement -
జిల్లా స్థాయిలో కొనసాగుతున్న ప్రక్రియ
ఎంఎఫ్‌సి చైర్మన్ ఇంతియాజ్ ఇషాఖ్ వెల్లడి

హైదరాబాద్ : మైనారిటీలకు ప్రభుత్వం ప్రకటించిన 100 శాతం సబ్సిడీతో రూ. లక్ష ఆర్థిక సహాయ పథకం కింద లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జిల్లా స్థాయిలో కొనసాగుతోందని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాఖ్ తెలిపారు. మైనారిటీ సబ్సిడీ రుణాల కోసం 202223 ఆర్థిక సంవత్సరంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 2,16,693 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. పెండింగ్ దరఖాస్తుల నుంచే అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం కింద కొత్తగా దరఖాస్తులను స్వీకరించడం జరుగదని ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News