- Advertisement -
తిరుపతి: తిరుమలలో ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. 8, 9 తేదీల్లో టిటిడి ఉద్యోగులతో పాటు ట్రయల్ దర్శనాలు ఉంటాయన్నారు. రోజుకు ఏడు వేల మందికి మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుందని, ఆన్లైన్లో టికెట్లు తీసుకొని భక్తులు రావాలని సూచించారు. అలిపిరి దగ్గర కూడా టికెట్లు బక్ చేసుకోవచ్చన్నారు. 65 ఏళ్లు పైబడిని వృద్ధులు, 10 ఏళ్ల లోపు చిన్నారులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలోని భక్తులు దర్శనాలకు రావొద్దని వైవి సూచించారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల లోపే దర్శనాలకు అనుమతి ఉంటుందని తెలియజేశారు. విఐపి బ్రేక్ దర్శనాలకు గంట మాత్రమే అనుమతి ఉందన్నారు.
- Advertisement -