Tuesday, May 7, 2024

పాలేరు మట్టి సాక్షిగా సంక్షేమ పాలన అందిస్తా

- Advertisement -
- Advertisement -

అమరావతి:  పాలేరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైెఎస్ షర్మిల మాట్లాడుతూ ఇదే పాలేరు మట్టి సాక్షిగా పాలేరు ప్రజలకు వైయస్‌ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని మాటిచ్చానని తెలిపారు. రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీ రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీలతో రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకొస్తానని వివరించారు. మళ్లీ చెబుతున్నా.. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తా అని షర్మిల ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాటిస్తున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని , అతికొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ పాదయాత్రను పాలేరులో ప్రారంభించి 4000 కిలో మీటర్లు పూర్తి చేసి పాలేరులోనే ముగిస్తానని షర్మిల వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News