Thursday, May 2, 2024

ట్రాక్టర్లు కట్టుకొని సినిమాకు వెళ్తున్నారు

- Advertisement -
- Advertisement -

Sharwanand act in Srikaram Movie

శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్.బి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ “మా సినిమాకు అద్భుతమైన స్పందన వస్తుండడంతో చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. మానవత్వపు విలువలు, భావోద్వేగాలను దర్శకుడు కిషోర్ తెరపై చాలా సహజంగా చూపించాడు.

మంచి సినిమాలు తీస్తే ఆదరిస్తారని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు”అని అన్నారు. రైటర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ “ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. దర్శకుడు కిషోర్‌ను ఎంత పొగిడినా తప్పులేదు. చాలా కష్టపడి మంచి సినిమాను తెరకెక్కించాడు”అని చెప్పారు. దర్శకుడు కిషోర్ మాట్లాడుతూ “ఈ కథ రాసుకున్నప్పటి నుండి తప్పకుండా కొన్ని సీన్స్ వర్కవుట్ అవుతాయని అనుకున్నాం. మేము అనుకున్నట్లుగానే ఆ సీన్స్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. కొందరు ప్రేక్షకులు అయితే ట్రాక్టర్లు కట్టుకొని మరీ సినిమాకు వెళ్తున్నారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు బాబీ, అజయ్ భూపతి, గోపీచంద్ మలినేని, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, సాయికుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News