Tuesday, April 30, 2024

సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

- Advertisement -
- Advertisement -

మంథని : సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్‌ఐ మధుసూదన్ రావు అన్నారు. శనివారం మంథని బాలికల జూనియర్ కళాశాలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోబైల్, ల్యాప్‌టాప్ పరికరాల వినియోగం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు.

అపరిచిత వయక్తులు, సందేశాలకు సమాధానాలు ఇవ్వకూడదన్నారు. ఎవరైనా ఓటీపీ కోసం కాల్స్ చేస్తే ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని సూచించారు. మోబైల్ వినియోగాన్ని ఎంత తక్కువ వినియోగిస్తే అంత మంచిదన్నారు. చదువుకునే వయసులో ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా ఉండాలన్నారు. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని గమనించాలన్నారు.

తల్లితండ్రులు తమ పిల్లల కోసం పడుతున్న శ్రమను గుర్తించి, ఉన్నత లక్షంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ ఝాన్సీ, అధ్యాపకులు శ్రీధర్ రావు, శశాంక్, తిరుపతి, తిరుమల్, నగేష్, శ్రీదేవి, ఎల్‌ఆర్‌కే రెడ్డి, మనస, చిన్నయ్య, హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ నాయక్, కానిస్టేబుళ్లు సంతోష్ కుమార్, సురేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News