Thursday, May 2, 2024

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు: ఆరుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్ : హర్యానా భివానీ జిల్లాలో సెర్లా శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు మృతి చెందారు. యువకులు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న స్టేషనరీ ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఐదుగురు యువకులు ఉండగా, ట్రక్కు హెల్పర్ కూడా ఉన్నాడు. నలుగురు అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో ఇద్దరు చనిపోయారు. ట్రక్కు డ్రైవర్ వచ్చిపోయే వాహనాలకు హెచ్చరికగా ఎలాంటి ఇండికేటర్ పెట్టలేదని బెహాల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సునీల్ షెయొరాన్ తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News