Thursday, May 2, 2024

మహారాష్ట్రలో టెంపోను ఢీకొన్న ట్రాక్టర్: ఆరుగురు మృతి, ఏడుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Six dead in Speedy Tempo collided tractor near sillod

ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరై టెంపోలో తమ ఇళ్లకు వాపసు వెళుతున్న వారిని ట్రాక్టరు ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు మరణించగా మరో ఏడుగురు గాయపడ్డారు. సిల్లోడ్ తాలూకాలోని మోధ వద్ద గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘట్సేంద్ర గ్రామంలో ఒక వివాహానికి హాజరై తమ స్వగ్రామం మంగ్రుల్‌కు వెళుతున్న ప్రయాణికుల టెంపోను చెరకు లోడుతో ఉన్న ట్రాక్టర్ ఢీకొన్నట్లు సిల్లోడ్ గ్రామీణ పోలీసు స్టేషన్ ఇన్‌సెక్టర్ సీతారాం మేత్ర తెలిపారు. టెంపోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించగా గాయపడిన మరో ఏడుగురిని సిల్లోడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News