Tuesday, April 30, 2024

కశ్మీరులో రెండు ఎన్‌కౌంటర్లు…. ఆరుగురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Encounter of two women Naxals in Dantewada

శ్రీనగర్: నగర శివార్లలో డిసెంబర్ 13న పోలీసు బస్సుపై జరిగిన దాడిలో ప్రమేయమున్న ఆరుగురు జైషే మొహమ్మద్(జెఇఎం) ఉగ్రవాదులు దక్షిణ కశ్మీరులో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. ఈ ఆపరేషన్లలో ఒక ఆర్మీ జవాను కూడా మరణించినట్లు గురువారం అధికారులు తెలిపారు. అనంత్‌నాగ్‌లో బుధవారం రాత్రి భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా కుల్గామ్ జిల్లాలో బుధవారం సాయంత్రం భద్రతా దళాల కాల్పులలో మరో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఈ కాల్పుల పోరులో ఆర్మీ జవాను జస్బీర్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. అనంత్‌నాగ్ ఆపరేషన్‌లో ఇద్దరు జవాన్లు, ఒక పోలీసు గాయపడ్డారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. మరణించిన ఉగ్రవాదులలో ఇద్దరు పాకిస్తాన్ జాతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News