Friday, May 3, 2024

ఫోన్ కొట్టు.. ఫ్రూట్ పట్టు

- Advertisement -
- Advertisement -

fruits

 

ఫోన్ చేస్తే చాలు.. రూ.300లకే ఆరు రకాల పండ్లు

వీలైనంత ఎక్కువ మొత్తంలో సరఫరా చేయండి.. మంత్రి నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ఇండ్ల వద్దకే పండ్ల సరఫరా కార్యక్రమాన్ని మార్కెటింగ్ శాఖ చేపట్టింది. కరోనా వైరస్ ప్రబలకుండా లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులకు అండగా ఉండేందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలకు మేరకు అధికారులు ఇంటివద్దకే పండ్ల సరఫరా కార్యక్రమం మొదలుపెట్టారు. మార్కెటింగ్ శాఖ మొదలు పెట్టిన ఈ ప్రయత్నానికి ఆదరణ పెరుగుతోంది. పండ్లను వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతుల వద్ద నుండి నేరుగా సేకరించి వినియోగదారులకు అందజేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మొత్తంలో పండ్ల సరఫరాకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని మంత్రి ఆదేశించారు. జంటనగారాలలో కాలనీలు, అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు 30 ప్యాక్ లు ఆర్డర్ ఇస్తే నేరుగా సరఫరా చేస్తున్నారు. రూ.300 లకు మామిడి కిలోన్నర, బొప్పాయి 3 కిలోలు, సపోట ఒక కిలో, బత్తాయి రెండున్న కేజీలు, 12 నిమ్మకాయల ప్యాక్, 4 కిలోల కలంగిరి అందిస్తున్నారు.

ఇప్పటికి 30 టన్నుల బత్తాయి, 10 టన్నుల మామిడి, 6 టన్నుల సపోట, 8 టన్నుల కలంగిరి (వాటర్ మిలన్), 2 టన్నుల నిమ్మ , 10 టన్నుల బొప్పాయి సరఫరా చేసినట్లు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 7330733212 కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే ఇంటివద్దకే నాణ్యమైన పండ్లు వస్తాయన్నారు. ఉద్యాన పంటల రైతులను ఆదుకునేందుకు ఈ ప్రయోగం సత్పలితాలిస్తోంది. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రవికుమార్, జె.డి శ్రీనివాస్, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ నర్సింహారెడ్డిల ఆధ్వర్యంలో పంపిణీ కొనసాగుతోంది. -లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాలకు బత్తాయి, మామిడి ఎగుమతులు నిలిచిపోయాయి. ఇక లాక్‌డౌన్‌తో -ప్రజలు బయటకు రాక స్థానికంగా అమ్ముకునేందుకు రైతులకు ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మొబైల్ రైతుబజార్ల ద్వారా రోజుకు 550 కేంద్రాలలో ప్రజల వద్దకు పండ్లు, కూరగాయలు సరఫరా చేస్తున్నారు. వారానికి జంట నగరాలలోని 3500 పై చిలుకు ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి.

Six varieties of fruits for Rs 300
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News