Saturday, May 4, 2024

అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా నుండి ఎస్‌ఐ , కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రాత పరీక్ష అర్హత పొందిన అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 4వ రోజు ప్రారంభం కాగా జిల్లా ఎస్పి కె. నర్సింహ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు.

జిల్లా పరిధిలో మొత్తం 550 మంది అభ్యర్థులకు 489 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 489 మంది అభ్యర్థులకు ధృవపత్రాలను పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పిరాములు, ఏఓ రుక్మిణి బాయి, సాయుధ దళ డిఎస్పి శ్రీనివాసులు, సుపరింటెండెంట్ యోహోవా దాస్, ఐటీ సెల్ సిబ్బంది , పరిపాలన విభాగం సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News