Tuesday, April 30, 2024

మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పి

- Advertisement -
- Advertisement -

మెదక్: మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఎస్పి రోహిణి ప్రియదర్శిని తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అక్కడి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంకటేశ్ ఎస్పికి వివరించారు. అనంతరం ఎస్పి అక్కడి అధికారులకు పలు సూచనలు చేస్తూ ప్రతి రోజు పోలీస్ స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ స్టేషన్‌లోని వర్టికల్స్ నిర్వహణ, హెచ్‌ఆర్‌ఎంఎస్ ఆన్‌లైన్ వినియోగించు విధానము, టిఎస్ సిఓపిఎస్ ఆన్‌లైన్‌లో కేసుల వివరాలు నమోదు చేయు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పిటిషల్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, సాంకేతికంగా ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని బాదితులకు న్యాయం చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచరాదని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి వివరించి వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పి సైదులు, పట్టణ ఎస్‌ఐ లింగం, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News