Tuesday, May 7, 2024

వృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం

- Advertisement -
- Advertisement -

Srivari Navarathri Celebrations

 

తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య రోజుల్లో ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 11న‌ మంగ‌ళ‌వారం వయోవృద్ధులు (65 సంవత్సరాల పైబడినవారు) దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగుల రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది. అదేవిధంగా, ఫిబ్ర‌వ‌రి 12న బుధ‌వారం 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

 

Special Darshanam for Old Man, Handicaped, Children
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News