- Advertisement -
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నవీ ముంబయి, సెక్టార్ 44 నెరుల్ సీవుడ్స్ లో హై రైజ్ అపార్ట్ మెంట్ లోని పై అంతస్తులో శనివారం ఉన్నటుండి భారీగా మంటలు చేలరేగాయి. దీంతో అందులోని ఉంటున్నవారు భయంతో బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టంగానీ జరగలేదు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.
Fire Breaks Out at High Rise Apartment in Mumbai
- Advertisement -