Monday, April 29, 2024

రెండో వన్డేలో పోరాడుతున్న భారత్..

- Advertisement -
- Advertisement -

 

అక్లాండ్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పోరాడుతోంది. కివీస్ బౌలర్ల ధాటికి భారత్ బ్యాట్స్ మెన్స్ క్రీజులో నిలవలేక పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రవీంద్ర జడేజాతో జతకట్టిన నవదీప్ సైనీ కీలక భాగస్వామ్యాన్ని నెలకోల్పి మళ్లీ గెలుపుపై ఆశలు రేపాడు. మొదట నిదానంగా ఆడిన సైనీ క్రమ క్రమంగా వరుస ఫోర్లు, సిక్స్ తో జోరు పెంచాడు. అదే ఊపులో భారీ షాట్ కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 229 పరుగుల వద్ద నవదీప్ సైనీ(45) ఎనిమిదొ వికెట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 46 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(47), చాహల్(2)లు ఉన్నారు. కాగా, భారత్ విజయానికి ఇంకా 24 బంతుల్లో 40 పరుగులు కావాలి.

India lost 8th wicket against New Zealand in 2nd ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News