- Advertisement -
అక్లాండ్: రెండో వన్డేలో టీమిండియాపై కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.3 ఓవర్లలో 251 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ పై 22 పరుగుల తేడాతో కివీస్ గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్ ను కివీస్ 2-0తో కైవసం చేసుకుంది. భారత్ బ్యాట్స్ మెన్స్ లో శ్రేయస్ అయ్యర్(52), రవీంద్ర జడేజా(55), నవదీప్ సైనీ(45)లు మాత్రమే రాణించగా.. ఓపెనర్లతోపాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లీ(15), కెఎల్ రాహుల్(4)లు ఘోరంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, జేమీసన్, గ్రాండ్ హోమ్, బెన్నెత్ లు తలో వికెట్ పడగొట్టగా, నీషమ్ ఒక వికెట్ తీశాడు.
New Zealand Win by against IND in 2nd ODI
- Advertisement -