- Advertisement -
హైదరాబాద్: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రెండో సోదరి భర్త రాజేశ్వర రావు(84) శనివారం ఉదయం కన్నుమూశారు. అల్వాల్ లోని మంగాపురిలో రాజేశ్వర రావు పార్థివదేహానికి సిఎం కెసిఆర్ పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజేశ్వర్రావు మృతిచెందిన వార్త తెలుసుకున్న మంత్రులు కెటిఆర్, హరీష్ లు ఉదయమే అక్కడికి చేరుకొని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. ఈ రోజు సాయంత్రం అల్వాల్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
KCR Pays floral Tributes to his second brother-in-law
- Advertisement -