Tuesday, May 7, 2024

సుందరయ్య పార్కు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ముఠాగోపాల్

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కుతో తనకు ఎంతో అనుబంధం ఉందని, సుందరయ్య పార్కు అభివృద్దితో పాటు భవిష్యత్తులో వాకర్స్‌కు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హామీ ఇచ్చారు. సుందరయ్య పార్కు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. రమేష్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డిని ఎమ్మెల్యే ముఠా గోపాల్ శాలువాతో సత్కరించి, అభినందించారు.

ఈ ఏడాది కాలంలోనే సుమారు రూ. 90 లక్షల వ్యయంతో సుందరయ్య పార్కులో పలు అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించి వాకర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. అదే తరహాలో మున్ముందు పార్కు అభివృద్దిలో కచ్చితంగా భాగస్వామిగా ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సీనియర్ వాకర్స్ క్లబ్ నాయకులు వెంకట కృష్ణ బబ్లూ, మన్నె దామోదర్ రెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి, నాగభూషణం, స్కైలాబ్ బాబు, వివేక్, సంతోష్ గౌడ్, బిఆర్‌ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్షులు రావులపాటి మోజస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News