Thursday, May 2, 2024

రేపు శ్రీకృష్ణజన్మష్టమి వేడుకలు

- Advertisement -
- Advertisement -
Sri krishna janmashtami celebration 2021
జంబాగ్ యాదవ సంఘంలో ఘనంగా ఏర్పాట్లు

హైదరాబాద్: నగరంలో శ్రీకృష్ణా జయంతోత్సవం పురస్కరించుకుని సోమవారం జంబాగ్‌లోని యాదవ సంఘం భవన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ యాదవ సంఘం చైర్మన్ చిట్టబోయిన నందకిషోర్ యాదవ్ తెలిపారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉదయం 11గంటలకు జెండా వందనం, 11.30గంటలకు హవనము సాయంత్రం 6.30గంటలకు గోపూజ, భజన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నగర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, నోముల భగత్ యాదవ్, బొల్లం మల్లయ్యయాదవ్, అంజయ్యయాదవ్, టిజీవో ఉద్యోగ సంఘం అధ్యక్షులు ఎం.బి. కృష్ణయాదవ్ హాజరైతున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమ ఏర్పాట్లు శెట్టి హరికృష్ణయాదవ్, గంట గోపియాదవ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News