హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే హైదరాబాదును అంబానీకి అమ్మేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు విమర్శనాస్త్రాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణ భవన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రుల మాటలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. గతంలో ప్రధాన మంత్రి సైతం సిఎం కెసిఆర్ ను ప్రశంసించారని, కానీ ఇప్పుడు ఎన్నికల కోసమే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము మేయర్ పదవిని ఎంఐఎంకు ఇస్తామని ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్న కేంద్ర ప్రభుత్వంపై చార్జిషీట్ వేయాలన్న ఆయన కేంద్రమంత్రులు తెలంగాణకు క్షమాపణలు చెప్పి వెళ్లాలని డిమాండ్ చేశారు.
Srinivas Goud Held Press Meet in Telangana Bhavan