Sunday, April 28, 2024

రెండ్రోజులుగా కఠినంగా లాక్‌డౌన్‌ అమలు

- Advertisement -
- Advertisement -

Strict lockdown enforcement in Telangana

హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలను పోలీసులు మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. రాష్ట్రంలో రెండ్రోజులుగా కఠినంగా లాక్‌డౌన్ అమలవుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. రెండ్రోజుల్లో వేలాది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లో రెండ్రోజులుగా లాక్‌డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. నగరంలో లాక్‌డౌన్ ను ముగ్గురు పోలీస్ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ లో రాత్రి వేళల్లోనూ ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. నిన్న సైబరాబాద్ కమిషనరేట్ లో 2,452 మందిపై, రాచకొండ పరిధిలో ఇప్పటివరకు 35 వేల మందిపై కేసులు నమోదు చేశారు. అనవసరంగా బయటకు రావద్దని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.

Strict lockdown enforcement in Telangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News