Wednesday, May 1, 2024

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడాలలో రాణించాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ మండల స్థాయి ఎస్‌జిఎఫ్ పోటీలను ఎమ్మె ల్యే మర్రి జనార్ధన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడ అంశాల్లో మంచి ప్రతిభను కనబరిచి రాణించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, జిల్లా ఎస్‌జిఎఫ్ సెక్రటరి ఎం. పాండు, జిల్లా ఎస్‌పిసి సెక్రటరి ప్రసాద్ గౌడ్, వ్యాయాయ ఉపాధ్యాయులు శేఖర్ బాబు, రమేష్, సత్యనారాయణ, వెంకటేష్, కృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News