Saturday, May 4, 2024

జగద్గిరిగుట్టలో యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మొబైల్ ఫోన్ పోయిందని మనస్థాపం చెందిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం తెల్లవారుజామున జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని కెటిఆర్ కాలనీలో ఉంటున్న నీతీష్ రాజ్(26) మొబైల్ పోయింది.

దీంతో తన మొబైల్ పోయిందని మనస్థాపం చెందాడు. కష్టపడి పనిచేసి కొనుగోలు చేసిన మొబైల్ పోవడంతో ఆవేదన చెందాడు. తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News