- Advertisement -
తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఇప్పటికే, ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించిన చిత్ర యూనిట్, ఇటీవలే సుధీర్ఘమైన షెడ్యూల్ను శరవేగంగా పూర్తి చేసింది. కాగా, తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ను షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ కోసం సూర్య స్టంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాకు వెంకీ అట్లూరి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే ఆసక్తికర టైటిల్ను ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో అందాల భామ మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. జివి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read : హృదయాన్ని తాకే ట్రైలర్
- Advertisement -