- Advertisement -
హైదరాబాద్: గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన నగరంలోని గచ్చిబౌలి ఎన్టీఆర్ నగర్లో చోటుచేసుకుంది. ఇంటి సమీపంలోని ఓ గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చేశారు. గదిలో మహిళ విగతజీవిగా పడిఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హూటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అయితే మృతులరాలు గత కొన్నిరోజులుగా కనిపించడం లేదని కుటుంబీకులు ఆగస్టు 26తేదీన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, నాలుగురోజుల్లోనే వారి ఇంటి సమీపంలోనే మహిళ డెడ్ బాడీ లభించడం పులు అనుమానాలకు తావిస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Suspicious death of a woman in Gachibowli
- Advertisement -