- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,924 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటిట్ కేసుల సంఖ్య లక్షా 23,090కు చేరింది. ఇప్పటివరకు కరోనా 818 మంది మృతి చెందారు. 24గంటల్లో మరో 1,638 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 90,988 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,284 యాక్టివ్ కేసులున్నాయి. 24,176 మంది బాధితులు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ పరిధిలో 461, కరీంనగర్ లో 172, ఖమ్మంలో 181, మేడ్చల్ లో 153, నల్గొండలో 171, నిజామాబాద్ లో 140, రంగారెడ్డిలో 213, సూర్యాపేటలో 118, వరంగల్ అర్భన్ లో 102, కొత్త కోవిడ్ కేసులు బయటపడ్డాయి.
2924 new covid 19 cases reported in telangana
- Advertisement -