Tuesday, April 30, 2024

భారతీయ పర్యాటకులకు ప్రయాణ గమ్యస్థానంగా స్విట్జర్లాండ్ 

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్విట్జర్లాండ్ టూరిజం బోర్డు నేడు హైదరాబాద్‌లోని హయత్ ప్లేస్‌లో స్విట్జర్లాండ్ టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించింది . కొవిడ్ మహమ్మారి అనంతర కాలంలో భారతీయ పర్యాటకులలో కనిపిస్తోన్న ధోరణులతో పాటుగా, భవిష్యత్తు లో అభివృద్ధి చెందనున్న ప్రయాణ ధోరణులపై కొంత సమాచారమిచ్చింది. భారతీయ పర్యాటకులు తాము సందర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాలలో స్విట్జర్లాండ్ ఎల్లప్పుడూ తన స్థానం నిలుపుకుని ఉండటం తో పాటుగా తమ అభిమాన వేసవి గమ్యస్థానంగా ఇక్కడి వారికి నిలిచింది. మహమ్మారి సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ, కొవిడ్ తర్వాత ఈ దేశం బాగా కోలుకుంది. ఒకప్పుడు వేసవి గమ్యస్థానంగా మాత్రమే పరిగణించబడుతున్న స్విట్జర్లాండ్ ఇప్పుడు అన్ని సీజన్లలో, ముఖ్యంగా శరదృతువులో మాత్రమే కాదు చలికాలంలో కూడా భారతీయ పర్యాటకులచే సందర్శింపబడుతున్నది.

“యాత్రలు, స్విట్జర్లాండ్‌లో గతంలో కంటే ఎక్కువగా విస్తరించాయి- స్విట్జర్లాండ్‌లో గడిపిన ఓవర్‌నైట్‌ల సంఖ్యలో 2019 కంటే 2023 మెరుగ్గా ఉంది – వేసవి, శీతాకాలం, స్కీ గమ్యస్థానాలకు విక్రయించబడిన వసతి, ముందస్తుగా బుక్ చేసిన కార్యకలాపాలను మేము చూస్తున్నాము. మహమ్మారి తర్వాత భారతదేశం నుండి, ఎక్కువ మంది వినూత్న అనుభవాలను కోరుకుంటున్న ప్రయాణికులను తాము చూస్తున్నాము. వీరు తమ దేశంలో ఎక్కువ కాలం వుంటున్నారు , స్థానిక సంస్కృతిలో లీనమవుతున్నారు. అలాగే దేశంలో పర్యటించడానికి ప్రజా ప్రయాణ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు, తద్వారా పర్యాటకాన్ని మరింత పర్యావరణ అనుకూలంగా మలచాలనే మా లక్ష్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నారు” అని విలేకరుల సమావేశంలో ఈస్ట్ మార్కెట్స్ చీఫ్ మార్కెట్స్ ఆఫీసర్ సైమన్ బోషార్ట్ అన్నారు.

భారతీయులు ఎక్కువగా జ్యూరిచ్, లూసెర్న్, ఇంటర్‌లాకెన్ వంటి నగరాలకు వెళతారు, అయితే జెర్మాట్ – మాటర్‌హార్న్ (స్విట్జర్లాండ్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్వతం) అలాగే ఇటాలియన్ మాట్లాడే ప్రాంతం టిసినో వంటి ప్రదేశాలను కూడా సందర్శించడానికి ఆసక్తి చూపుతున్నారు.

“స్విట్జర్లాండ్‌ లో ప్రతి సంవత్సరం పర్యాటకులను ఆకర్షిస్తున్న విషయం ఏమిటంటే, ఇది ప్రయాణీకుల సమయాన్ని గౌరవించే బాధ్యతాయుతమైన, స్థిరమైన ప్రయాణ గమ్యస్థానం, స్వచ్ఛమైనది, వ్యవస్థీకృతమైనది. అన్నింటికంటే ఎక్కువగా ప్రకృతి సౌందర్యంతో ఆశీర్వదించబడింది. కొవిడ్ తర్వాత ఎక్కువ మంది వ్యక్తిగత, చిన్న సమూహాలుగా ప్రయాణించడం మేము చూస్తున్నాము, వీరిలో ఎక్కువ మంది తమ సెలవురోజులు మొత్తం ఒకే దేశంలో గడుపుతున్నారు. గత రెండేళ్ళలో టైర్ II/III భారతీయ నగరాల నుండి భారతీయ ప్రయాణీకులు ఎక్కువగా రావటం కూడా మేము గుర్తించాము, ఇది మరొక ప్రోత్సాహకరమైన ధోరణి” అని స్విట్జర్లాండ్ టూరిజం – ఇండియా డిప్యూటీ డైరెక్టర్, మార్కెటింగ్ హెడ్ రీతు శర్మ అన్నారు.

స్వచ్ఛమైన, హరిత జీవనం, స్వచ్ఛమైన గాలి నాణ్యత, ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చే పర్యావరణ అనుకూల పద్ధతుల కారణంగా, ప్రకృతి ప్రేమికులకు స్విట్జర్లాండ్ స్థిరమైన గమ్యస్థానంగా మారింది. స్విస్ ట్రావెల్ సిస్టమ్ అని కూడా పిలువబడే స్థానిక ప్రజా రవాణా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ సమయానికి, బాగా అనుసంధానించబడి, అత్యంత సమర్థవంతమైనదిగా ఉంటుంది. ఒక ప్రయాణ పాస్‌తో, ప్రయాణికులు దేశవ్యాప్తంగా 90కి పైగా నగరాలు, పట్టణాల్లో యాక్సెస్‌ను కలిగి ఉంటారు, బస్సులు, రైళ్లు, బోట్ల విస్తృత నెట్‌వర్క్ ద్వారా 500 కంటే ఎక్కువ మ్యూజియంలు అనుసంధానించబడి ఉన్నాయి.

దేశంలోని కలినరీ సంస్కృతి ఇంధన పొదుపు కోసం వివిధ వంట పద్ధతులను ప్రోత్సహిస్తుంది, స్థానిక పదార్ధాలను జాగ్రత్తగా సోర్సింగ్ చేయడం మరియు ఆహార వృధాను తగ్గించడానికి వినూత్న సాంకేతికతలను ప్రోత్సహిస్తుంది.

స్విట్జర్లాండ్ టూరిజం, గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తోన్న మరో అభివృద్ధి చెందుతున్న ధోరణి ఏమిటంటే, అంతకుముందు, చాలా పెద్ద సమూహాలు స్నేహితులు, కుటుంబాలతో ఆ దేశానికి ప్రయాణించగా, స్విట్జర్లాండ్ ఇప్పుడు ఫ్రీ ఇండిపెండెంట్ ట్రావెల్లెర్స్ (FITలు)లు అలాగే మరింత చురుకైన, ఆరుబయట సెలవుల కోసం చూస్తున్న ప్రయాణికుల కోసం అంతే సమానంగా మనోహరమైన గమ్యస్థానంగా రూపాంతరం చెందింది.

స్విట్జర్లాండ్ టూరిజం ఇప్పుడు తమ స్నేహ పూర్వక రాయబారిగా నీరజ్ చోప్రాతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రకృతి మరియు సాహసాల పట్ల తనకున్న ప్రేమకు పేరుగాంచిన నీరజ్ సాహస ప్రియుల కోసం స్విట్జర్లాండ్‌లో అందుబాటులో ఉన్న వివిధ కార్యకలాపాలను వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News