Thursday, May 2, 2024

విద్యార్థిపై టీచర్ దాష్టీకం…

- Advertisement -
teacher-beats-student
హైదరాబాద్: నగరంలోని ఎల్ బినగర్‌లో గురువారం దారుణం చోటుచేసుకుంది. బైరామల్‌గూడలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠాలు నేర్పాల్సిన ఓ టీచర్ విద్యార్థి పట్ల దాష్టీకం ప్రదర్శించాడు. 4వ తరగతి చదుతున్న విద్యార్థి సాయి ఇషాన్ తలపై డ్రాయింగ్‌ టీచర్‌ పిడిగుద్దులతో దాడి చేశాడు. దీంతో ఆ విద్యార్థి అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులు చెప్పడంతో టీచర్ పై మండిపడ్డారు. గాయపడిన కుమారుడిని ఆస్పత్రికి  తరలించారు. పాఠశాల యాజమాన్యం, టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు.. ఎల్ బినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో టీచర్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Teacher Beats Student At LB Nagar Hyderabad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News