Thursday, May 2, 2024

మూడో టెస్టుకు భారత జట్టు ప్రకటన..

- Advertisement -
- Advertisement -

  Team India announce Playing XI for 3rd Test

సిడ్నీ: ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. గురువారం(రేపు) నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు మ్యాచ్ కు భారత్ తుది జట్టును ప్రకటించింది. అజింక్యా రహానె సారథ్యంలోని పదకొండు మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. రెండో టెస్టు అనంతరం జట్టుతో కలిసిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. గత రెండు మ్యాచ్ లో విఫలమైన మయాంక్ అగర్వాల్ జట్టులో స్థానం కోల్పోయాడు. మరోవైపు గాయం కారణంగా సిరీస్ కు దూరమైన ఉమేష్ యాదవ్ స్థానంలో చోటుదక్కించుకున్న పేసర్ నవదీప్ సైనీ ఈ మ్యాచ్ తో టెస్టు అరంగ్రేటం చేయనున్నాడు. కాగా, మొదటి టెస్టులో ఘోన పరాజయం చవిచూసిన టీమిండియా అద్భుతంగా పుంజుకొని రెండో టెస్టు మ్యాచ్ లో కంగారులపై ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో టెస్టులోనూ భారత్ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.

  Team India announce Playing XI for 3rd Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News