Thursday, May 2, 2024

ఫోన్ లాక్కున్నారని.. ఉరేసుకున్న 15ఏళ్ల బాలిక!

- Advertisement -
- Advertisement -

teenage girl hanged herself at hyderabad

హైదరాబాద్: ప్రస్తుత మోడ్రన్ యుగంలో మొబైల్ ఫోన్ మనజీవితాల్లో ఓ భాగమైపోయింది. యువతరానికైతే ఇది లేకపోతే పొద్దే గడవటంలేదు. మొబైల్ ఓ వ్యసనంలా మారింది. ఎంతలా అంటే ఇది లేకపోతే ప్రాణం తీసుకునేంతలా. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనే దీనికి ఉదాహరణ. నగరానికి చెందిన ఓ 15ఏళ్ల బాలిక ఎప్పుడూ చేతిలో మొబైల్ పట్టుకొని, ఏవో వీడియోలు చూస్తూ ఉంటోంది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఈ వ్యసనం నుంచి కుమార్తెను దూరం చేయాలనుకున్నారు. అంతే, ఆమె ఫోన్ వాళ్లు తీసేసుకున్నారు. ఆ తర్వాత ఆఫీసుకు వెళ్లారు. వారు ఇంటికి తిరిగొచ్చే సరికే ఆ బాలిక ఉరేసుకొని కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

teenage girl hanged herself at hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News