Sunday, April 28, 2024

రాంచీలో కెసిఆర్ పర్యటన: జార్ఖండ్ ముఖ్యమంత్రితో భేటీ

- Advertisement -
- Advertisement -
Telangana CM KCR meets Jharkhand CM Hemant Soren
కేసీఆర్ బృందానికి అపూర్వ స్వాగతం : గల్వాన్ అమరవీరులకు కేసీఆర్ సాయం

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. గిరిజన ఉదయ నేత బిర్సా ముండా విగ్రహానికి తొలుత కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం ఝార్ఖండ్ సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. జాతీయ రాజకీయాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తున్నారు. ఝర్ఖండ్ రాజధాని రాంచీలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. తొలుత గిరిజన ఉదయ నేత బిర్సా ముండా విగ్రహానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం ఝార్ఖండ్ సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. కేసీఆర్ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత బృందాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. దేశ రాజకీయాలు, భాజపాకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసే అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారు.

కేసీఆర్ బృందానికి అపూర్వ స్వాగతం : గల్వాన్ అమరవీరులకు కేసీఆర్ సాయం

ఝార్ఖండ్ రాజధాని రాంచీ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అపూర్వ స్వాగతం లభించింది. బంగారు తెలంగాణ నిర్మాత , జాతీయ ఫెడరల్ నేత అంటూ కేసీఆర్కు ఝార్ఖండ్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాంచీ విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్ నేరుగా బిర్సా ముండా చౌక్కు చేరుకుని అక్కడ అన్న గిరిజన ఉద్యమ నేతకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చగల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లను ఆదుకుంటామని గతంలో ఇచ్చిన మాట మేరకు వారికి సాయం అందించనున్నారు. ఝార్ఖండ్కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను సోరేన్తో కలిసి కేసీఆర్ అందిస్తారు. చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన కర్నల్ సంతోశ్ బాబు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. ఈ సందర్భంగా అమరులైన 19 మంది అమర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు ఝార్ఖండ్లో సైనికుల కుటుంబాలకు సాయం చేస్తారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత మిగిలిన ప్రాంతాల్లో ప్రకటించి.. ఆయా రాష్ట్రాల అమర జవాన్ల కుటుంబాలకు కూడా సాయం అందించనున్నారు.

కేసీఆర్ పేరిట భారీ కటౌట్లు: తెలంగాణ సీఎం పర్యటన నేపథ్యంలో రాంచీ నగరంలో పలు చోట్ల కేసీఆర్ పేరిట బ్యానర్లు, కటౌట్లు దర్శనమిచ్చాయి. ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అనే నినాదాలు కలిగిన కటౌట్లతో రాంచీ నగరంలోని వీధులు గులాబీమయమయ్యాయి. గతంలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం సమయంలోనూ దేశ్ కీ నేత కేసీఆర్ అనే బ్యానర్లు, కటౌట్లు కనిపించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రాంచీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాంచీ చేరుకున్నారు. గల్వాన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తారని తెలిపారు. అనంతరం ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్తో భేటీ అవుతారని వెల్లడించారు. ఝార్ఖండ్-తెలంగాణ దగ్గరి సారూప్యం కలిగిన రాష్ట్రాలని అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News