- Advertisement -
హైదరాబాద్: గ్రేటర్ పోరుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. తాజాగా పార్లమెంటు నియోజకవర్గాలకు పిసిసి సమన్వయకర్తలను అధిష్టానం నియమించింది. కాంగ్రెస్ నేడు అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఈ నెల 19న అభ్యర్థులకు బి ఫారాలు ,21న జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. హైదరాబాద్ పార్లమెంటుకు షబ్బీర్ అలీ, సికింద్రాబాద్కు భట్టి విక్రమార్క, చేవెళ్లకు పొన్నం ప్రభాకర్, మల్కాజ్గిరికి జీవన్రెడ్డి, మెదక్కు కుసుమ కుమార్లు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.
Telangana Congress Ready for GHMC Elections
- Advertisement -