Sunday, May 5, 2024

అన్ని రంగాల్లో అగ్రగామిగా పురోగమిస్తున్న తెలంగాణ

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని, జగిత్యాల శాసన సభ నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక విరూపాక్షి గార్డెన్స్‌లో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ మహిళా దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షతన వహించి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎంఎల్‌ఎ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని ఏక తాటిపైకి తీసుకువచ్చి, ఆయా వర్గాల వారికి అండగా నిలిచిన వ్యక్తి మన సిఎం కెసిఆర్ అని వివరించారు. ఆసరా పెన్షన్‌లు మంజూరు చేయడం జరిగిందని, దివ్యాంగులకు మరో వెయ్యి రూపాయలు పెంచుతన్నట్లు సిఎం ప్రకటించారని తెలిపారు. మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని అభివర్ణించారు.

ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాల ద్వారా చేయడం జరుగుందన్నారు. అంగన్వాడీ, ఆయా, ఎఎన్‌ఎంల వేతనాలు పెంచడం జరిగిందన్నారు. ఇంటింటికీ నల్లా నీళ్లు అందించడం జరుగుతుందన్నారు. జడ్‌పి చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడానికి మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించడం, అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పెన్షన్‌లు, వడ్డీలేని రుణాలు తదితర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం మహిళలకు బాసటగా నిలుస్తుందని అన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని, మహిళల అభ్యుదయానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, ఒంటరి మహిళా, గృహలక్ష్మి వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. గ్రంధాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రశేకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు.

అంతకుముందు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్ వివరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా అధికారులు, సిబ్బందిని, మహిళా ప్రజా ప్రతినిధులను శాలువా, మేమోంటో, ప్రశంస పత్రాలతో సత్కరించారు. బ్యాంక్ లింకేజి కింద పట్టణ మహిళా సంఘాలకు రూ.2 కోట్ల 29 లక్షల రుణాల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, ఆర్‌డిఓ మాధవి, జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్‌లు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News