- Advertisement -
హైదరాబాద్: ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంత్రి సందర్భంగా ప్రభుత్వం భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలంగాణ ప్రజలకు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన యాసల్నే మన బతుకున్నదని, నీ భాషల్నే నీ బతుకున్నదని, నీ యాసల్నే నీ సంస్కృతి ఉన్నదంటూ తెలంగాణ భాష, యాసలోని కమ్మదనాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన మహాకవి కాళోజి అని ప్రశంసించారు.
“మన యాసల్నే మన బతుకున్నది,
నీ భాషల్నే నీ బతుకున్నది, నీ యాసల్నే నీ సంస్కృతున్నది” అంటూ తెలంగాణ భాషను, యాసలోని కమ్మదనాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు pic.twitter.com/Pxpf8yfECM— Harish Rao Thanneeru (@trsharish) September 9, 2020
- Advertisement -