హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సిఎం కెసిఆర్ కొత్త రెవెన్యూ బిల్లును బుధవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ… వ్యవసాయ భూముల రిజిస్టేషన్లు తహసీల్దార్లు, వ్యవసాయేతర భూముల రిజిస్టేషన్లు సబ్ రిజిస్ట్రార్లు చేస్తారని సిఎం తెలిపారు. ఏరకమైన భూమి అయినా రిజిస్టేషన్ చేసుకోవాలంటే ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. ఇక నుంచి రెవెన్యూ కోర్టులు ఉండవన్న ముఖ్యమంత్రి పెండింగ్ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు మంజూరు అవుతాయని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయడానికి ఈ కొత్త బిల్లును తీసుకొస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు.
Live: CM KCR introducing the New Revenue Bill in Telangana Legislative Assembly https://t.co/lYsOBX9NRu
— Telangana CMO (@TelanganaCMO) September 9, 2020
KCR Introduces New Revenue Act Bill In TS Assembly