సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. అందులో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ ఎంఎల్ఎ జగ్గారెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ కు భారీ షాక్ తలిగింది. ఎంఐఎం సహకారంతో టిఆర్ఎస్ అత్యధిక వార్డులను గెలుచుకుంది. దీంతో చైర్ పర్సన్ పీఠాన్ని టిఆర్ఎస్ దక్కించుకుంది. సంగారెడ్డిలో 38 వార్డులు ఉన్నాయి. అందులో టిఆర్ఎస్ 18, కాంగ్రెస్ 12, ఎంఐఎం 02, బిజెపి 03, ఇండిపెండెంట్ అభ్యర్థులు 03 స్థానాల్లో గెలుపొందారు.
telangana municipal corporation election results live
- Advertisement -