Tuesday, May 7, 2024

జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

Tension at Jubilee Hills Apollo Hospital

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనగామ జిల్లా వాసి నాగరాజు మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాగరాజు చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద మృతిని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ నెల 7న రోడ్డు ప్రమాదంలో నాగరాజు గాయపడ్డాడు. మెరుగైన వైద్య కోసం అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటివరకు రూ.9లక్షలు చెల్లించినట్టు మృతుని బంధువులు వెల్లడించారు. మరో రూ.15లక్షలు చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపణలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆస్పత్రి వద్దకు భారీగా తరలివచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tension at Jubilee Hills Apollo Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News